బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ బాబారాందేవ్ ఆశ్రమంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఉత్తరాఖండ్ రిషికేశ్లోని ఓ ఆలయ సమీపంలోగల రాందేవ్బాబా ఆశ్రమంలోనే ఈమె గడుపుతుందని ఓ పత్రిక పేర్కొంది.
అయితే ఆమె వద్దకు ఆశ్రమవాసులనుగానీ, ప్రజలనుగానీ ఎవరినీ అనుమతించడం లేదు. తన భార్య గురించి మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నప్పటి నుంచి జశోదాబెన్ వార్తల్లో ఉంటున్నారు. మోదీ ఈ దేశ ప్రధాని అయ్యేంత వరకు తాను ఉపవాసదీక్షలో ఉంటానని, చెప్పులు లేకుండా వట్టి కాళ్లతో.. నడుస్తానని జశోదాబెన్ ‘దీక్ష’ పూనినట్టు ఆమె సోదరుడు కమలేష్ లోగడే ప్రకటించారు.